బ్రేకింగ్ : ప్రణబ్ ముఖర్జీ మృతి

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించారు. ఆర్మీ ఆసుపత్రి వర్గాలు కొద్దిసేపటి క్రితం ఈ విషయాన్ని నిర్ధారించాయి. గత కొంతకాలంగా ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్ ముఖర్జీ చికిత్స [more]

Update: 2020-08-31 12:48 GMT

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించారు. ఆర్మీ ఆసుపత్రి వర్గాలు కొద్దిసేపటి క్రితం ఈ విషయాన్ని నిర్ధారించాయి. గత కొంతకాలంగా ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్ ముఖర్జీ చికిత్స పొందుతున్నారు. ఈనెల 10వ తేదీన ప్రణబ్ ముఖర్జీ ఆర్మీ ఆసుపత్రిలో చేరారు. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో శస్త్ర చికిత్స చేయించుకునేందుకు ఆర్మీఆసుపత్రిలో ప్రణబ్ ముఖర్జీ చేరారు. ఈ సమయంలోనే ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. దీంతో గత కొద్దిరోజులుగా ప్రణబ్ ముఖర్జీకి వెంటలేటర్ పైనే చికిత్స అందిస్తున్నారు. దీనికితోడు ప్రణబ్ కు ఊపిరితిత్తుల సమస్య కూడా తోడయింది. వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. 1935 డిసెంబరు 11న ప్రణబ్ ముఖర్జీ జన్మించారు.

Tags:    

Similar News