ఎస్ఎం కృష్ణ అల్లుడు అదృశ్యం

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అల్లుడు వీజీ సిద్ధార్థ్ అదృశ్యమయ్యారు. వ్యాపారంలో నష్టం రావడంతో ఆయన మనస్థాపానికి గురై నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారన్న అనుమానాలు [more]

Update: 2019-07-30 05:20 GMT

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అల్లుడు వీజీ సిద్ధార్థ్ అదృశ్యమయ్యారు. వ్యాపారంలో నష్టం రావడంతో ఆయన మనస్థాపానికి గురై నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారన్న అనుమానాలు వస్తున్నాయి. వీజీ సిద్ధార్థ్ కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు. ఆయన నిన్న రాత్రి మంగుళూరు వెళుతూ నేత్రావతి బ్రిడ్జి సమీపంలో ఫోన్ మాట్లాడుతూ కారు దిగారు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో డ్రైవర్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో కర్ణాటక పోలీసులు నేత్రావతి నదిలో వీజీ సిద్ధార్థ్ కోసం గాలింపు చర్యలుచేపట్టారు. చివరిగా కేఫ్ కాఫీ డే సీఈవో తో 57 నిమిషాలు ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది. కంపెనీ నష్టాల్లోకి రావడానికి తానే కారణమని, బిజినెస్ మెన్ గా తాను ఫెయిల్ అయ్యానని వీజీ సిద్ధార్థ్ మానసికంగా గత కొద్ది రోజుల నుంచి ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News