కాసేపట్లో బలపరీక్ష.. కమల్ నాధ్ కు అగ్నీ పరీక్ష

మద్యప్రదేశ్ అసెంబ్లీ ఈరోజు సమావేశం కాబోతోంది. కమల్ నాధ్ ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కొనాల్సి ఉంది. సుప్రీంకోర్టు తీర్పుతో కమల్ నాధ్ బలపరీక్షకు సిద్ధమవ్వక తప్పలేదు. సుప్రీంకోర్టు ఆదేశాలతో [more]

Update: 2020-03-20 02:39 GMT

మద్యప్రదేశ్ అసెంబ్లీ ఈరోజు సమావేశం కాబోతోంది. కమల్ నాధ్ ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కొనాల్సి ఉంది. సుప్రీంకోర్టు తీర్పుతో కమల్ నాధ్ బలపరీక్షకు సిద్ధమవ్వక తప్పలేదు. సుప్రీంకోర్టు ఆదేశాలతో నేడు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమల్ నాధ్ సర్కార్ ట్రబుల్ లో పడింది. వీరంతా బెంగళూరులోనే ఉన్నారు. బలపరీక్ష జరిగతే కమల్ నాధ్ విశ్వాసం కోల్పోవడం గ్యారంటీ అని చెబుతున్నారు. సాయంత్రం ఐదుగంటలలోపు బలపరీక్షను ముగించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

Tags:    

Similar News