టీడీపీలో తొలి చేరిక… ఉత్సహమే ఉత్సాహం

ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరికలు మొదలయ్యాయి. విశాఖపట్నం జిల్లా అరకు ప్రాంతానికి చెందిన దొన్ను దొర తెలుగుదేశం పార్టీలో చేరారు. ఓటమి తర్వాత తొలి [more]

Update: 2019-09-04 08:08 GMT

ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరికలు మొదలయ్యాయి. విశాఖపట్నం జిల్లా అరకు ప్రాంతానికి చెందిన దొన్ను దొర తెలుగుదేశం పార్టీలో చేరారు. ఓటమి తర్వాత తొలి చేరిక కావడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. చంద్రబాబు సమక్షంలో దొన్ను దొరతో పాటు మరికొందరు అరకు నియోజకవర్గానికి చెందిన నేతలు చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. దొన్ను దొర గత ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ రాక రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి రెండోస్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ టీడీపీ నేతలను కొనుక్కుంటుందని ఆరోపించారు. అధికారంలో లేకుంటే పార్టీ నుంచి వెళ్లిపోయే వారు తమకు అవసరం లేదని చంద్రబాబు చెప్పారు.

Tags:    

Similar News