ఆర్టీసీ బస్సులో కాల్పుల కలకలం

బస్సు దిగమన్నందుకు వాగ్వాదం పెట్టుకున్న ఓ ప్రయణికుడు రెచ్చిపోయాడు. తన దగ్గర ఉన్న గన్ తో గాల్లోకి కాల్పులు జరిపాడు. సికింద్రాబాద్ నుంచి మణికొండకు వెళ్తున్న బస్సు [more]

Update: 2019-05-02 07:22 GMT

బస్సు దిగమన్నందుకు వాగ్వాదం పెట్టుకున్న ఓ ప్రయణికుడు రెచ్చిపోయాడు. తన దగ్గర ఉన్న గన్ తో గాల్లోకి కాల్పులు జరిపాడు. సికింద్రాబాద్ నుంచి మణికొండకు వెళ్తున్న బస్సు ఎక్కేందుకు పంజాగుట్టలో ఇద్దరు యువకులు ప్రయత్నించారు. అయితే, ఫుట్ బోర్డుపై ఓ ప్రయాణికుడు అడ్డుగా నిలబడ్డాడు. దీంతో సదరు ప్రయాణికుడు, యువకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన ప్రయాణికుడు గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో బస్సు పైగా బాగం నుంచి బుల్లెట్ దూసుకెళ్లిపోయింది. తర్వాత అతడు బస్సు దిగి పారిపోయాడు. అయితే, బస్సులో ఇంత జరిగినా డ్రైవర్ మాత్రం బస్సు ఆపకుండా వెళ్లిపోయాడు. ఈ ఘటనతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా హడలిపోయారు. కాల్పులు జరిపిన వ్యక్తి సఫారి డ్రెస్ వెసుకున్నాడని, అతను గన్ మెన్ అయ్యి ఉంటాడని భావిస్తున్నారు.

Tags:    

Similar News