ధర్నాకు దిగిన రైతు సంఘాలు

మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రైతు సంఘాలు ధర్నా చేపట్టాయి. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో కిసాన్ మజ్దూర్ [more]

Update: 2021-07-22 05:41 GMT

మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రైతు సంఘాలు ధర్నా చేపట్టాయి. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ధర్నాకు దిగింది. కేవలం 200 మందికి మాత్రమే ధర్నాకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ నెల 22 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకూ తమ ఆందోళనలను రైతులు జంతర్ మంతర్ వద్ద కొనసాగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే మరోసారి జనవరి 26 ఘటన పునరావృత్తం కాకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News