తరలింపుపై హైకోర్టులో?

రాజధాని కార్యాలయం తరలింపు పై రైతులు హైకోర్టులో పిటీషన్ వేశారు. న్యాయ విభాగానికి చెందిన విజలెన్స్ కమిషన్ కార్యాలయాన్ని కర్నూలుకు ఏపీ ప్రభుత్వం తరలిస్తూ ఆదేశాలు జారీ [more]

Update: 2020-02-03 06:38 GMT

రాజధాని కార్యాలయం తరలింపు పై రైతులు హైకోర్టులో పిటీషన్ వేశారు. న్యాయ విభాగానికి చెందిన విజలెన్స్ కమిషన్ కార్యాలయాన్ని కర్నూలుకు ఏపీ ప్రభుత్వం తరలిస్తూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం, సీఆర్డీఏ ఛైర్మన్, సీఆర్డీఏను ప్రతివాదులుగా చేరుస్తూ రాజధాని రైతులు హైకోర్టులో పిటీషన్ వేశారు. కార్యాలయాలను తరలించవద్దంటూ గతంలో హైకోర్టు స్పష్టం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని రైతులు పిటీషన్ లో పేర్కొన్నారు. రాజధాని రైతులు వేసిన పిటీషన్ ను హైకోర్టు స్వీకరించింది.

Tags:    

Similar News