హైకోర్టుకు రాజధాని రైతులు

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లులను రాజ్యాంగ విరుద్ధమని రైతులు పిటీషన్ వేశారు. రాజభవన్, ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయం [more]

Update: 2020-08-03 04:56 GMT

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లులను రాజ్యాంగ విరుద్ధమని రైతులు పిటీషన్ వేశారు. రాజభవన్, ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయం అమరావతిలోనే ఉండేలా ఆదేశాలివ్వాలని పిటీషన్ లో కోరారు. తమతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను తుంగలో తొక్కి ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులను ఆమోదించుకుందన్నారు. చట్ట వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలను అడ్డుకోవాలని అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ రేపు జరిగే అవకాశముంది.

Tags:    

Similar News