పవన్ మైక్ లో జగన్ కేక

కర్నూలు జిల్లా పోరాట యాత్రలో ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఇవాళ కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆదోని మార్కెట్ యార్డులో ‘రైతులతో [more]

Update: 2019-02-25 14:23 GMT

కర్నూలు జిల్లా పోరాట యాత్రలో ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఇవాళ కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆదోని మార్కెట్ యార్డులో ‘రైతులతో జనసేనాని ముఖాముఖి’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రైతులతో పవన్ కళ్యాణ్ నేరుగా మాట్లాడించి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మైక్ పట్టుకోగా… ఓ రైతు మాట్లాడారు. రైతుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని.. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తేనే రైతులకు మేలు జరుగుతుందని.. జగన్ ను గెలిపించాలని అన్నారు. పవన్ కళ్యాణ్ మైక్ పట్టుకోగా రైతు ఇలా మాట్లాడటంతో పవన్ తో పాటు వేదిక మీదున్న ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది.

Tags:    

Similar News