ఈ నెంబర్ కోసం ఏకం రూ.16 లక్షలు పెట్టాడు...

Update: 2018-05-17 14:06 GMT

బైక్ లకు, కార్లకు ఫ్యాన్సీ నెంబర్లు తగిలించుకోవాలని కొందరికి మామూలు మోజు ఉండదు. ఇందు కోసం ఎన్ని డబ్బులైనా తగలేసేందుకు రెడీగా ఉంటారు. ఇటువంటి వ్యక్తే రాజస్థాన్ రాజధాని జైపూర్ కు చెందిన రాహుల్ తనీజా. ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ నిర్వహించే ఇతను ఇటీవల రూ.కోటిన్నర పెట్టి జాగ్వార్ కారు కొన్నాడు. ఈ కారుకు ‘1’ నెంబరు కావాలని ఆర్టీఏ ను కోరాడు. ఇందుకోసం ఆర్టీఏ నిర్వహించిన వేలంలో ఏకంగా రూ.16 లక్షలు బిడ్ వేసి ఆర్ జే 45 సీజీ 0001 నెంబరును దక్కించుకున్నారు. రాహుల్ మిగతా వాహనాలకు కూడా 1 నెంబరే ఉంది. ఆయన ఫోన్ నంబరులో కూడా ఐదు ఒకట్లు ఉన్నాయంట. 1 నంబరు రాహుల్ కు అంతగా కలిపి వస్తుందంట మరి.

Similar News