బ్రేకింగ్ : కర్నూలు జిల్లాలో దారుణం.. వైసీపీ నేత…?

కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. పత్తికొండ – చినహుల్తీ దగ్గర సీపీఐ నేత రాంభూపాల్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ప్రత్యర్థి వైసీపీ నేత అమర్ [more]

Update: 2020-12-30 08:36 GMT

కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. పత్తికొండ – చినహుల్తీ దగ్గర సీపీఐ నేత రాంభూపాల్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ప్రత్యర్థి వైసీపీ నేత అమర్ నాధ్ రెడ్డి ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. రాంభూపాల్ రెడ్డిని జీపుతో ఢీకొట్టి తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించారు. ఇనుపరాడ్లతో కొట్టేందుకు దుండగులు ప్రయత్నించారు. అయితే స్థానికులు అడ్డుకోవడంతో వైసీపీ నేత అమర్ నాధ్ రెడ్డి పరారయ్యారు. రాంభూపాల్ రెడ్డిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్దకు సీఐఐ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.

Tags:    

Similar News