ఫేస్ బుక్ పరిచయం... ముగ్గురి ప్రాణాలు తీసింది

Update: 2018-08-03 10:57 GMT

ఫేస్ బుక్ పరిచయం మూగు కుటుంబాల్లో విషాదం నింపింది. అన్యోన్యంగా ఉంటున్న దంపతులతో పాటు వివాహితను ప్రేమించిన వ్యక్తి మరణాలకు కారణమైంది. రాజమండ్రికి చెందిన బిందు, సాయి కొన్నాళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారు ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉండేవారు. అయితే, ఇటీవల జంగారెడ్డిగూడానికి చెందిన ఓ కానిస్టేబుల్ కుమారుడు మురళి అనే యువకుడితో బిందుకు ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. దీంతో మురళి తరచూ బిందుకు ఫోన్ చేసేవాడు. ఇటీవల మురళి నేరుగా బిందు భర్త సాయికి ఫోన్ చేసి వారి ప్రేమ విషయాన్ని చెప్పి బిందును తనకు వదిలేయాలని చెప్పాడు. దీంతో మనస్థాపం చెందిన సాయి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణంతో బిందు కూడా కుమిలిపోయింది. ప్రియుడు మురళి ముందే గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు మురళిని విచారించారు. దీంతో మురళి కూడా ఆత్మహత్య చేసుకుని మరణించాడు. వివాహితతో ఫేస్ బుక్ పరిచయం ముగ్గురి మరణానికి కారణం అయ్యింది.

Similar News