బ్రేకింగ్ : వైసీపీలో చేరిన మీసం మెలేసిన పోలీస్

ఇటీవల పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఐ గోరంట్ల మాధవ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోలీస్ అధికారుల సంఘానికి ప్రతినిధిగా ఉన్న ఆయన అనంపురం ఎంపీ [more]

Update: 2019-01-26 06:44 GMT

ఇటీవల పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఐ గోరంట్ల మాధవ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోలీస్ అధికారుల సంఘానికి ప్రతినిధిగా ఉన్న ఆయన అనంపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాడిపత్రిలో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో పోలీసులపై ఎంపీ జేసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై పోలీస్ అధికారుల సంఘం నేతగా గోరంట్ల మాధవ్ మీసం మెలేసి నాలుక కోస్తా అని జేసీ దివాకర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. అప్పటికే ఆయనకు స్థానికంగా యువతలో మంచి క్రేజ్ ఉంది. ఈ సంఘటన తర్వాత ఆయనకు ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసిన మాధవ్ ఇవాళ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. కురబ సామాజకవర్గానికి చెందిన ఆయనను హిందూపురం పార్లమెంటు నుంచి లేదా ఆ పార్లమెంటు పరిధిలోని ఏదైనా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News