కేసీఆర్ తో మాట్లాడే ప్రసక్తి లేదు

కేసీఆర్ తో మాట్లాడే ప్రసక్తి లేదని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తనపై ఒక ప్లాన్ ప్రకారం కుట్ర జరిగిందని ఆయన చెప్పారు. గత కొద్ది [more]

Update: 2021-05-02 01:13 GMT

కేసీఆర్ తో మాట్లాడే ప్రసక్తి లేదని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తనపై ఒక ప్లాన్ ప్రకారం కుట్ర జరిగిందని ఆయన చెప్పారు. గత కొద్ది రోజులుగా ఈ పరిణామాలు జరుగుతున్నాయని, తాను మాత్రం కరోనా మీద దృష్టి పెట్టానని ఈటల రాజేందర్ తెలిపారు. తన నియోజకవర్గంలోని ప్రజలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఈటల రాజేందర్ తెలిపారు. ఇంత దారుణమైన కుట్ర తనపై జరుగుతుందని ఊహించలేదన్నారు. దీని ఫలితం భవిష్యత్ లో అనుభవించక తప్పదని ఈటల రాజేందర్ తెలిపారు.

Tags:    

Similar News