లాక్ డౌన్ సమస్యే లేదు

కరోనా సెకండ్ వేవ్ హైదరాబాద్ లోనే మొదలయిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మహారాష్ట్ర ప్రభావం తెలంగాణపై తీవ్రంగా ఉందని చెప్పారు. అయితే లాక్ [more]

Update: 2021-04-18 06:13 GMT

కరోనా సెకండ్ వేవ్ హైదరాబాద్ లోనే మొదలయిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మహారాష్ట్ర ప్రభావం తెలంగాణపై తీవ్రంగా ఉందని చెప్పారు. అయితే లాక్ డౌన్, కర్ఫ్యూ విధించే అవకాశం లేదని ఈటల రాజేందర్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు. 65 వేల బెడ్లు అందుబాటులో ఉన్నాయని ఈటల రాజేందర్ తెలిపారు. రేపటి నుంచి శానిటైజేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని ఈటల తెలిపారు. మాస్క్ అందరికీ శ్రీరామ రక్ష అని చెప్పారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకుండా ఉండటమే బెటర్ అని ఈటల రాజేందర్ తెలిపారు.

Tags:    

Similar News