తెలంగాణలో కేసులు పెరగడానికి కారణమిదే

తెలంగాణలో అత్యధికంగా కేసులు నమోదవ్వడానికి కారణాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వివరించారు. కర్ణాటక, ఛత్తీస్ ఘడ్, ఏపీ, మహారాష్ట్రలో కరోనా కేసులు పెరిగాయని, [more]

Update: 2021-04-11 01:30 GMT

తెలంగాణలో అత్యధికంగా కేసులు నమోదవ్వడానికి కారణాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వివరించారు. కర్ణాటక, ఛత్తీస్ ఘడ్, ఏపీ, మహారాష్ట్రలో కరోనా కేసులు పెరిగాయని, ఈ ప్రభావం తెలంగాణపై పడిందని ఈటల రాజేందర్ తెలిపారు. అయితే కేసుల సంఖ్య పెరుగుతున్నా వైరస్ తీవ్రత తగ్గుతుందన్నారు. అవసరమైతే తప్ప ప్రయాణాలను పెట్టుకోవద్దని ఈటల రాజేందర్ సూచించారు. అయితే లాక్ డౌన్ ను రాష్ట్రంలో విధించే ఆలోచన ఏమీ లేదని ఈటల రాజేందర్ తెలిపారు.

Tags:    

Similar News