ఈటలపై అధిష్టానం సీరియస్..మరో నిర్ణయం దిశగా

ఈటల రాజేందర్ వ్యవహారం పై టీఆర్ఎస్ అధిష్టానం సీిరియస్ గా ఉంది. ఆయనను పార్టీ నుంచి బహిష‌్కరించాలన్న యోచనలో ఉంది. ఇప్పటికే ఈటల రాజేందర్ పార్టీకి వ్యతిరేకంగా [more]

Update: 2021-05-07 01:20 GMT

ఈటల రాజేందర్ వ్యవహారం పై టీఆర్ఎస్ అధిష్టానం సీిరియస్ గా ఉంది. ఆయనను పార్టీ నుంచి బహిష‌్కరించాలన్న యోచనలో ఉంది. ఇప్పటికే ఈటల రాజేందర్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుండటంతో కరీంనగర్ జిల్లా పార్టీ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని తీర్మానం చేసి పంపింది. ఈటల రాజేందర్ వ్యవహారాన్ని నానస్తూ వెళితే పార్టీకి మరింత డ్యామేజీ అవుతుందని భావించిన అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే ఎమ్మెల్యేగా అనర్హత వేటును ఈటల రాజేందర్ పై వేయాలని కూడా స్పీకర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.

Tags:    

Similar News