కేసీఆర్ కు ఈటల క్షమించమంటూ లేఖ రాశారా?

ఈటల రాజేందర్ కేసీఆర్ కు రాసిన లేఖ కలకలం రేపుతుంది. ఆయన వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో [more]

Update: 2021-06-25 08:17 GMT

ఈటల రాజేందర్ కేసీఆర్ కు రాసిన లేఖ కలకలం రేపుతుంది. ఆయన వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ లేఖ వైరల్ అవుతుంది. ఈ లేఖలో తాను చేసింది తప్పేనని ఈటల రాజేందర్ అంగీకరించారు. తాను సమావేశాలు జరిపింది నిజమేనని,ఈ సమావేశాలకు పెద్దపల్లి లీడర్లు కూడా హాజరయ్యారని ఒప్పుకున్నారు. తామంతా పార్టీకి విధేయులుగానే ఉంటామని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మీతో సాన్నిహిత్యం ఎంతో గొప్పదని, నా వేలు పెట్టుకుని నడిపించారని ఈటల రాజేందర్ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ లెటర్ ఫేక్ అని కొందరు అంటున్నారు. ఈటల రాజేందర్ ను బద్నాం చేయడానికే కొందరు ఈ లేఖను సృష్టించి సోషల్ మీడియాలో ఉంచారంటున్నారు. మొత్తం మీద ఈటల రాజేందర్ రాసిన లేఖ కలకలం రేపుతుంది.

Tags:    

Similar News