త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తా

తన నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తన ఉద్యమానికి అన్ని పార్టీల నేతలను కలసి మద్దతును కోరుతున్నానని చెప్పారు. ఈటల రాజేందర్ [more]

Update: 2021-05-13 00:34 GMT

తన నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తన ఉద్యమానికి అన్ని పార్టీల నేతలను కలసి మద్దతును కోరుతున్నానని చెప్పారు. ఈటల రాజేందర్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ను కలిశారు. గంటన్నరకు పైగా జరిగిన సమావేశంలో టీఆర్ఎస్ లో పరిస్థితులపై ఇద్దరూ చర్చించినట్లు తెలిసింది. భవిష్యత్ రాజకీయాలపై వారు మాట్లాడుకున్నారు. అనంతరం ఈటల రాజేందర్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ను కూడా కలిశారు. తన పోరాటానికి మద్దతివ్వాల్సింగా ఈటల రాజేందర్ కోరారు.

Tags:    

Similar News