బ్రేకింగ్ : గుంటూరు, చిత్తూరు కలెక్టర్లపై వేటు

ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. గుంటూరు, చిత్తూరు జిల్లాలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడం, నామినేషన్లను వేయనీయక పోవడంపై అనేక అభ్యంతరాలు తమ దృష్టికి వచ్చాయన్నారు. దీంతో [more]

Update: 2020-03-15 04:55 GMT

ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. గుంటూరు, చిత్తూరు జిల్లాలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడం, నామినేషన్లను వేయనీయక పోవడంపై అనేక అభ్యంతరాలు తమ దృష్టికి వచ్చాయన్నారు. దీంతో గుంటూరు, చిత్తూరు కలెక్టర్ ను విధుల నుంచి తప్పించాలని ఈసీ ఆదేశించింది. అలాగే పుంగనూరు, శ్రీకాళహస్తి, మాచర్ల పోలీసు అధికారులను కూడా అక్కడి నుంచి బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగేలా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఘర్షణలు జరిగిన చోట ఎన్నికలను రీషెడ్యూల్ చేస్తామని ఎన్నికల కమిషనర్ తెలిపారు.

Tags:    

Similar News