హైదరాబాద్ లో రూ.8 కోట్లు… ఎవరవంటే…??

హైదరాబాదులో మరోసారి భారీగా నగదును పట్టుకున్నారు. ఈసారి ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయల డబ్బును టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఒక బ్యాంకు నుంచి డబ్బులు [more]

Update: 2019-04-08 11:52 GMT

హైదరాబాదులో మరోసారి భారీగా నగదును పట్టుకున్నారు. ఈసారి ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయల డబ్బును టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఒక బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొని వెళుతుండగా టాస్క్ ఫోర్స్ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆదేశాల మేరకు ఈ డబ్బులను డ్రా చేసినట్లుగా పార్టీ కార్యాలయ నిర్వాహకులు గోపి పోలీసులు చెప్పారు నారాయణగూడ లోని ఒక బ్యాంకు నుంచి ఈ డబ్బులు తీసుకు రావాలని చెప్పినట్టుగా గోపి పోలీసులకు తెలిపాడు. ఎనిమిది కోట్ల రూపాయల చెక్కును ఇచ్చారని గోపి తెలిపారు. డబ్బులు డ్రా చేసుకొని వస్తున్న సమయంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు గోపీని పట్టుకున్నారు. ఎన్నికల సమయంలో తమ అభ్యర్థులకు ఖర్చుల నిమిత్తం వీటిని తీసుకెళుతున్నట్లు పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు.

Tags:    

Similar News