బ్రేకింగ్ : మాయావతి, యోగికి ఈసీ షాక్

ఎన్నికల ప్రచారంలో మతపరంగా విధ్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాధ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. యోగి ఆధిత్యానంద్ 72 [more]

Update: 2019-04-15 09:41 GMT

ఎన్నికల ప్రచారంలో మతపరంగా విధ్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాధ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. యోగి ఆధిత్యానంద్ 72 గంటలు ప్రచారం చేయకుండా ఆయనకు ఆంక్షలు విధించింది. మాయావతిపై 48 గంటల పాటు ఆంక్షలు విధించారు. రాజకీయ నేతలు ఎన్నికల ప్రచారంలో నిబంధనలకు విరుద్ధంగా మతవిధ్వేషాలు రెచ్చగొడితే ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇద్దరు ముఖ్యనేతలపై ఈసీ చర్యలు తీసుకుంది.

Tags:    

Similar News