బ్రేకింగ్ : లోక్ సభలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల బిల్లు

ఈబీసీలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో రిజర్వేషన్ల రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి [more]

Update: 2019-01-08 07:40 GMT

ఈబీసీలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో రిజర్వేషన్ల రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఎవరూ ఊహించని విధంగా నిన్న నరేంద్ర మోదీ క్యాబినెట్ అగ్రకులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మాణం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇవాళ లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టారు. ఇక, అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లను తాము స్వాగతిస్తున్నామని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. కాకపోతే ఇది మోదీ ఎన్నికల జిమ్మక్కు అని ఆమె పేర్కొన్నారు.

Tags:    

Similar News