కట్టె కాలే వరకూ జగన్ వెంటే

విజయనగరం జిల్లాలో జరిగిన సభలో ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి భావోద్వేగానికి గురయ్యారు. గిరిజన పాఠశాలల్లో చదువుకున్న తనను గిరిజన సంక్షేమ శాఖకు మంత్రిగా చేసిన జగన్ [more]

Update: 2020-02-24 07:08 GMT

విజయనగరం జిల్లాలో జరిగిన సభలో ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి భావోద్వేగానికి గురయ్యారు. గిరిజన పాఠశాలల్లో చదువుకున్న తనను గిరిజన సంక్షేమ శాఖకు మంత్రిగా చేసిన జగన్ కు పుష్పశ్రీవాణి కృతజ్ఞతలు తెలిపారు. తనకు మంత్రిని చేయడమే కాకుండా ఉపముఖ్యమంత్రిని చేయడం తాను ఊహించలేదన్నారు. తాను జగనన్నకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఎనిమిది నెలలుగా ఎదురు చూస్తున్నానని, విజయనగరం జిల్లాలోనే చెప్పడం కోసం తాను ఎదురు చూస్తున్నానన్నారు. తాను, తన భర్త పరీక్షిత్ రాజు కట్టెకాలేంత వరకూ జగన్ వెంటే ఉంటామన్నారు. జగన్ రాజకీయాలు వదిలేస్తే తాము కూడా వదిలేస్తామని చెబుతూ డిప్యూటీ సీఎం కన్నీటి పర్యంతమయ్యారు. తాను జన్మజన్మలకూ జగన్ కు రుణపడి ఉంటానని, తమకు రాజకీయంగా మంచి భవిష్యత్ ఇచ్చిన జగన్ ను జన్మజన్మలకూ రుణపడి ఉంటామని భావోద్వేగానికి గురయ్యారు.

Tags:    

Similar News