దమ్ముంటే రండి… అన్ని చూపిస్తా

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చకు ఎప్పుడైనా, ఎక్కడైనా సిద్ధమని వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ సవాల్ విసిరారు. టీడీపీ నేతలు తప్పుడు ప్రచారానికి దిగుతున్నారన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు [more]

Update: 2021-09-01 08:49 GMT

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చకు ఎప్పుడైనా, ఎక్కడైనా సిద్ధమని వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ సవాల్ విసిరారు. టీడీపీ నేతలు తప్పుడు ప్రచారానికి దిగుతున్నారన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో ఇసుమంతైనా అభివృద్ధి జరిగిందా? అని దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు. జగన్ పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని నారా లోకేష్ క్షమాపణ చెప్పాలని దువ్వాడ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పోలవరం చంద్రబాబు హయాంలో ఏమీ కాలేదని, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే పనులు వేగవంతమయ్యాయని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. దమ్ముంటే తనతో చర్చకు రావాలని, సాక్షాధారాలన్నీ చూపిస్తానని ఆయన సవాల్ విసిరారు.

Tags:    

Similar News