హైద‌రాబాద్ లో ప‌ట్టుబ‌డ్డ డ్ర‌గ్స్ ముఠా

నిషేధిత డ్ర‌గ్ స‌రఫ‌రా చేస్తున్న‌ ఓ ముఠాను బోయిన్ ప‌ల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.వారి నుంచి 600 గ్రాముల‌ నార్కోటిక్ హెపెడ్రిన్ డ్ర‌గ్ స్వాధీనం చేసుకుని ముగ్గురు [more]

Update: 2019-02-07 10:22 GMT

నిషేధిత డ్ర‌గ్ స‌రఫ‌రా చేస్తున్న‌ ఓ ముఠాను బోయిన్ ప‌ల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.వారి నుంచి 600 గ్రాముల‌ నార్కోటిక్ హెపెడ్రిన్ డ్ర‌గ్ స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను రిమాండ్ కు త‌ర‌లించారు. మ‌రో ఇద్ద‌రు ప‌రారిలో ఉన్న‌ట్లు బేగంపేట్ ఏసీపీ రంగారెడ్డి మీడియాకు తెలిపారు. వీరు క్రీడాకారుల‌ను టార్గెట్ చేస్తూ డ్ర‌గ్ స‌ప్లై చేస్తున్నారు. అనంత‌పురానికి చెందిన‌ చెన్న‌కేశ‌వులు, ర‌మ‌ణ‌, శ్రీనివాస్ నాయుడు, తాడిప‌త్రికి చెందిన‌ అహ్మ‌ద్ వ‌లీ, గాజుల‌రామారానికి చెందిన‌ కిశోర్ క‌లిసి డ్ర‌గ్ స‌ప్లై చేస్తున్నారు.హైద‌రాబాద్ లో క‌స్ట‌మ‌ర్ల‌కు స‌ర‌ఫ‌రా చేయ‌డానికి బోయిన్ ప‌ల్లి స్వీట్ హాట్ హోటల్ వ‌ద్ద‌కు రాగా ప‌క్కా స‌మాచారంతో పోలీసులు మాటువేసి ప‌ట్టుకున్నారు. అందులో ర‌మ‌ణ‌.శ్రీనివాస్ నాయుడులు త‌ప్పించుకున్నారు. నిందితులను రిమాండ్ కు త‌ర‌లించారు.

Tags:    

Similar News