ఆ నివేదిక హ్హ..హ్హ..హ్హ...!!

Update: 2018-11-06 13:34 GMT

సిట్ నివేదిక అందాక తాను స్పందిస్తానని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చే నివేదికలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసునన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చే నివేదికలకు విశ్వసనీయత లేదన్న ధర్మాన ఆ రిపోర్టు చూసిన తర్వాతనే తాను స్పందిస్తానని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చే నివేదికలను చూసి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన నవ్వి ఊరుకున్నారు. తనకు విశాఖ భూముల విషయంలో ఎటువంటి సంబంధం లేదని, నిజం నిలకడమీద తెలుస్తుందని ధర్మాన చెప్పారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇలాంటి జిమ్మిక్కులు చేయడం అలవాటేనని ధర్మాన మండిపడ్డారు.

Similar News