బ్రేకింగ్ : హోం క్వారంటైన్ లోకి ఏపీ మంత్రి, స్పీకర్

ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కుమారుడికి కరోనా సోకింది. ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో మంత్రి ధర్మాన కృష్ణదాస్ హోం క్వారంటైన్ [more]

Update: 2020-07-10 06:27 GMT

ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కుమారుడికి కరోనా సోకింది. ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో మంత్రి ధర్మాన కృష్ణదాస్ హోం క్వారంటైన్ కు వెళ్లారు. అయితే ఈనెల 8వ తేదీన మంత్రి ధర్మాన కృష్ణదాస్ వైఎస్ జయంతి సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ కార్యక్రమాల్లో స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు విజయసాయిరెడ్డి కూడా పాల్గొన్నారు. మంత్రి కుమారుడికి కరోనా సోకడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం సయితం హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. పదిహేను రోజులు తమ వద్దకు ఎవరూ రావద్దని స్పీకర్, మంత్రి కార్యకర్తలకు సూచించారు.

Tags:    

Similar News