హాజరయ్యేది లేదు..!

Update: 2018-10-06 07:50 GMT

ధర్మాబాద్ కోర్టుకు వెళ్లవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్ణయించారు. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చంద్రబాబు గతంలో చేసిన ఆందోళన నేపథ్యంలో నమోదైన కేసుపై మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టులో కేసు నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే, వాయిదాలకు హాజరుకాని నేపథ్యంలో చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో కోర్టుకు హాజరు కావాలా.. వద్దా అనే అంశంపై చంద్రబాబు నాయుడు శనివారం అడ్వకేట్ జనరల్, సీనియర్ మంత్రులతో సమాలోచనలు జరిపారు. అయితే, కొందరు మంత్రులు భారీ ర్యాలీగా కోర్టుకు వెళ్లాలని చంద్రబాబుకు సూచించారు. కానీ, కోర్టుకు వెళ్లి జరిమానా కడితే తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లు అవుతుందని మరికొందరు సలహా ఇచ్చారు. దీంతో కోర్టుకు హాజరు కావద్దనే చంద్రబాబు నిర్ణయించారు. దీంతో ధర్మాబాద్ కోర్టులో రీకాల్ పిటీషన్ వేయనున్నారు.

Similar News