డీజీపీ తప్పుకుంటారా..? తప్పిస్తారా..?

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఎవరైనా కొత్త ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అధికారులను మార్చి వారికి అనుకూలంగా ఉండేవారిని నియమించుకుంటారు. దీంతో ఇప్పుడు [more]

Update: 2019-05-24 07:05 GMT

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఎవరైనా కొత్త ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అధికారులను మార్చి వారికి అనుకూలంగా ఉండేవారిని నియమించుకుంటారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఏపీ డీజీపీ ఠాకూర్ పై పడింది. ఆయనను జగన్ కొనసాగిస్తారా లేదా తప్పిస్తారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. డీజీపీ ఠాకూర్ వైఖరిపై ప్రతిపక్షంలో ఉండగా జగన్ సహా వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో దాడి జరిగినప్పుడు కొద్దిసేపట్లోనే డీజీపీ మీడియా ముందుకు వచ్చి దాడి చేసింది జగన్ అభిమానే అని చెప్పారు. తర్వాత పలు సందర్భాల్లోనూ ఆయన టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన జగన్ ను, వైసీపీని ఇబ్బంది పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనను కచ్చితంగా జగన్ తప్పిస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. కానీ, ఆయన నిన్న జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మరి, జగన్ గతాన్ని మరిచిపోయి ఆయనను కొనసాగిస్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News