మాపై దుష్ప్రచారాన్ని ఆపండి

ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని డీజీపీ గౌతం సవాంగ్ ఖండిచారు. పోలీసులపై కావాలని కొందరు చేస్తున్న వ్యాఖ్యలు పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని ఆయన [more]

Update: 2021-01-13 07:27 GMT

ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని డీజీపీ గౌతం సవాంగ్ ఖండిచారు. పోలీసులపై కావాలని కొందరు చేస్తున్న వ్యాఖ్యలు పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కారణాలతో పోలీసులపై కామెంట్స్ చేయడం సరికాదన్నారు. తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని చెప్పారు. కరోనాతో 109 మంది పోలీసులు గత ఏడాది మరణించారని చెప్పారు. ఏపీ పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని డీజీపీ కితాబిచ్చారు. దీనికి వంకు పైగా అవార్డులు రావడమే నిదర్శనమని చెప్పారు. ఆలయాల్లో దాడులు పాల్పడిన వారిని వదిలపెట్టబోమని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు.

Tags:    

Similar News