ఎంత ఆర్డర్ పెట్టారో చెప్పాలి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వ్యాక్సిన్లను ఎన్ని ఆర్డర్ పెట్టారో చెప్పాలని ప్రభుత్వాన్ని దేవినేని ఉమ ప్రశ్నించారు. తమిళనాడు, కేరళ, [more]

Update: 2021-05-10 00:59 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వ్యాక్సిన్లను ఎన్ని ఆర్డర్ పెట్టారో చెప్పాలని ప్రభుత్వాన్ని దేవినేని ఉమ ప్రశ్నించారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాలు కోటికిపైగా వ్యాక్సిన్లు ఆర్డర్ పెట్టాయని, ఏపీ మాత్రం ఎన్ని ఆర్డర్ పెట్టిందో చెప్పడం లేదని దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. వ్యాక్సినేషన్ కోసం జనం పడిగాపులు కాస్తున్నారని దేవినేని ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. కరోెనా నియంత్రణపై ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News