జగన్ గాలి వీస్తోంది… భారీ విజయం ఖాయం

ఆంధ్రప్రదేశ్ లో ప్రభంజనంలా జగన్ గాలి వీస్తోందని, 2019లో భారీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు, పారిశ్రామికవేత్త దాసరి జైరమేష్ పేర్కొన్నారు. [more]

Update: 2019-02-15 12:44 GMT

ఆంధ్రప్రదేశ్ లో ప్రభంజనంలా జగన్ గాలి వీస్తోందని, 2019లో భారీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు, పారిశ్రామికవేత్త దాసరి జైరమేష్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత జగన్ ను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హీనాతిహీనంగా పాలన జరుగుతుందని, అవినీతి రాజ్యమేలుతోందన్నారు. తన జీవితంలో ఇంత అవినీతి జరుగుతున్న ప్రభుత్వం చూడలేదని ఆరోపించారు. ప్రతీ పనిలో 20 నుంచి 30 శాతం అవినీతిరూపంలో చేతులు మారుతుందన్నారు. కొందరు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలే తనకు ఈ విషయం చెప్పారన్నారు. గెలిచిన మొదటి రెండేళ్లలోనే ప్రతీ టీడీపీ ఎమ్మెల్యే కనీసం 100 కోట్లు సంపాదించారని, ఇప్పటికి ఒక్కో ఎమ్మెల్యే 300 కోట్ల మేర సంపాదించినట్లు తెలుస్తోందన్నారు.

పార్టీ కోసం ఎంతో చేశాం…

తాను 35 ఏళ్ల నుంచి టీడీపీ కోసం ఎంతో చేశానని, కానీ పార్టీ నుంచి ఎటువంటి లబ్ధి పొందలేదన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, చంద్రబాబుకు వ్యక్తిగతంగానూ ఎన్నో సహాయాలు చేశానని గుర్తుచేశారు. కానీ గతంలో చంద్రబాబు తనకు మాటిచ్చి తప్పినందున పార్టీపై విరక్తితో 2001 నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. ఇప్పుడు రాజకీయాల్లో జగన్ పాటిస్తున్న విలువలు, మాట తప్పని విధానం నచ్చి వైసీపీలో చేరుతున్నానని పేర్కొన్నారు. చేయగలిగిన పనులే చేస్తానని జగన్ చెబుతున్నారని, చంద్రబాబులా ఎన్నికల కోసం చేయలేని పనులు చేస్తానని చెప్పడం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి జనాకర్షణ కలిగిన నాయకుడని, ఆయన ఘన విజయం సాధించి మంచి పరిపాలన అందిస్తారని ఆశిస్తున్నాన్నట్లు తెలిపారు.

Tags:    

Similar News