సజ్జనార్ కు పదోన్నతి

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కు ప్రమోషన్ వచ్చింది. అదనపు డీజీపీగా సజ్జనార్ కు ప్రమోషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతానికి ఐజి గా [more]

Update: 2021-03-11 02:05 GMT

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కు ప్రమోషన్ వచ్చింది. అదనపు డీజీపీగా సజ్జనార్ కు ప్రమోషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతానికి ఐజి గా ఉన్నా సజ్జనార్ కు అదనపు డిజిపి గా ప్రభుత్వం ప్రమోట్ చేసింది . ముగ్గురు ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్ ఇచ్చి అదే పోస్టులో కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. సజ్జనార్ తో పాటు మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులకు తెలంగాణ ప్రభుత్వం డీజి గా ప్రమోషన్ ఇచ్చింది. కేంద్ర సర్వీస్ లో కొనసాగుతున్న చారుసిన్హా తో పాటు హైదరాబాద్ ట్రాఫిక్ చీప్ గా కొనసాగుతున్న అనిల్ కుమార్ లకు కూడా ప్రమోషన్ ఇచ్చింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తూ జీవో జారీ చేసింది.

Tags:    

Similar News