నడ్డా ఏ లడ్డూ ఇచ్చాడో

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తుకు ఎందుకు సిద్ధమయ్యారో సమాధానం చెప్పాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. ఢిల్లీకి వెళ్లిన ఏ నేతలైనా జేఎన్ [more]

Update: 2020-01-16 07:52 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తుకు ఎందుకు సిద్ధమయ్యారో సమాధానం చెప్పాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. ఢిల్లీకి వెళ్లిన ఏ నేతలైనా జేఎన్ యూకు వెళ్లి వస్తారని, దీపికా పడుకోనే కూడా ధైర్యం చూపారని కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఢిల్లీ వెళ్లి నడ్డాను కలసి వచ్చారని ఎద్దేవా చేశారు. మోదీ, షాలను ఎదిరించే ధైర్యం, దమ్ము తనకు ఉన్నాయని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎందుకు బీజేపీతో కలుస్తున్నారో చెప్పాలన్నారు. ఏపీకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని విమర్శించిన పవన్ కల్యాణ్ కు నడ్డా ఏం లడ్డూ ఇచ్చారని ప్రశ్నించారు. చెగువీరా సిద్ధాంతాలను వల్లె వేసే ఆయన మతతత్వ పార్టీతో ఎందుకు తహతహలాడుతున్నారని ప్రశ్నించారు.

Tags:    

Similar News