శారదా పీఠానికి సీపీఐ నేత నారాయణ

విశాఖ శారదా పీఠానికి సీపీఐ నేత నారాయణ వెళ్లారు. స్వరూపానందేంద్ర స్వామితో నారాయణ మాట్లాడారు. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అటుగా వెళుతున్న నారాయణ ఆశ్రమంలోకి [more]

Update: 2021-03-04 00:48 GMT

విశాఖ శారదా పీఠానికి సీపీఐ నేత నారాయణ వెళ్లారు. స్వరూపానందేంద్ర స్వామితో నారాయణ మాట్లాడారు. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అటుగా వెళుతున్న నారాయణ ఆశ్రమంలోకి వెళ్లారు. తమ అభ్యర్థిని కూడా గెలిపించాలని స్వరూపానందేంద్ర స్వామిని నారాయణ కోరారు. స్వామీజీని కలిసి తమను గెలిపించమని కోరిన వారందరినీ గెలిపిస్తారటకదా? అందుకే తమ పార్టీ అభ్యర్థిని కూడా గెలిపించమని స్వామీజీని నారాయణ కోరారు. సీపీఐ అగ్రనేత స్వామీజీని కలవడం చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News