బ్రేకింగ్ : శాసనమండలి నిరవధిక వాయిదా

శాసనమండలి నిరవధికంగా వవవాయిదా పడింది. మండలిలో టీడీపీ ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు, బీద రవిచంద్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ల మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరి మధ్య పెద్దయెత్తున [more]

Update: 2020-06-17 14:38 GMT

శాసనమండలి నిరవధికంగా వవవాయిదా పడింది. మండలిలో టీడీపీ ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు, బీద రవిచంద్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ల మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరి మధ్య పెద్దయెత్తున ఘర్షణ జరిగింది. పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థిితికి వెళ్లింది. దీంతో పాటు నారా లోకేష్ పై మంత్రులు మండలి ఛైర్మన్ కు ఫిర్యాదు చేశారు. సెల్ ఫోన్ తో లోకేష్ ఫొటోలు తీశారని ఫిర్యాదు చేశారు. దీంతో ఫొటోలు తీయవద్దని డిప్యూటీ ఛైర్మన్ లోకేష్ కు సూచించారు. శాసనమండలిలో గందరగోళ పరిస్థితులు నెలకొని ఉండటంతో డిప్యూటీ ఛైర్మన్ శాసనమండలిని నిరవధికంగా వాయిదా వేశారు. ఏ బిల్లులను తీసుకోకుండానే శాసనమండలి వాయిదా పడింది.

Tags:    

Similar News