వెయ్యికి చేరువలో…? ఆ రెండు జిల్లాల్లోనే?

తెలంగాణలో కరోనా వైరస్ ఆగడం లేదు. వెయ్యికి చేరువలో కేసుల సంఖ్య ఉంది. నిన్న ఒక్క రోజే కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. [more]

Update: 2020-04-23 01:10 GMT

తెలంగాణలో కరోనా వైరస్ ఆగడం లేదు. వెయ్యికి చేరువలో కేసుల సంఖ్య ఉంది. నిన్న ఒక్క రోజే కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 943కు చేరుకుంది. మొన్న 56 కేసులు నమోదవడంతో అధికారులు కొంత ఆందోళన చెందారు. అయితే నిన్న కేసులు 15కే పరిమితం కావడంతో అధికార యంత్రాంగం కొంత ఊపిరి పీల్చుకుంది. ఇప్పటి వరకూ తెలంగాణలో మృతిచెందిన వారి సంఖ్య 24కు చేరుకుంది. సూర్యాపేట, హైదరాబాద్ జిల్లాల్లో ఈ వ్యాధి ఎక్కువగా ఉంది. దీంతో ప్రభుత్వం ఇక్కడ ప్రత్యేక చర్యలను చేపట్టింది.

Tags:    

Similar News