చుట్టుకుంటున్న వైరస్.. ఇరవై వేలు దాటి

భారత్ లో కరోనా వైరస్ చుట్టుకుంటోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఇప్పటి వరకూ భారత్ లో 20,471 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. [more]

Update: 2020-04-23 03:17 GMT

భారత్ లో కరోనా వైరస్ చుట్టుకుంటోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఇప్పటి వరకూ భారత్ లో 20,471 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ 652 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో అత్యధికంగా 5,221 కేసులు నమోదయ్యాయి. తర్వాత గుజరాత్ 2,441 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 2,15 కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ వల్ల కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది. అమర్ నాద్ యాత్రను కూడా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రద్దు చేసింది.

Tags:    

Similar News