ఇండియాలో మూడువేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

భారత్ లో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకూ 3,053 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే 508 పాజిటివ్ [more]

Update: 2020-04-04 03:35 GMT

భారత్ లో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకూ 3,053 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే 508 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 229 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. మహారాష్ట్రలో 423, ఢిల్లీ 400 మంది కరోనా పాజిటివ్ కేసులతో అత్యధికంగా కన్పిస్తున్నాయి. కరోనా వైరస్ తో ఇప్పటి వరకూ 84 మంది మృతి చెందారు. హాట్ స్పాట్ లను గుర్తించిన ప్రభుత్వం అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Tags:    

Similar News