ఏపీలో పెరుగుతున్న కేసులు.. మూడు వేలకు చేరువలో?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుంది. 24 గంటల్లో ఏపీలో 68 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2787కు [more]

Update: 2020-05-27 06:15 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుంది. 24 గంటల్లో ఏపీలో 68 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2787కు చేరుకుంది. గడచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. దీంతో ఏపీ లో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 58కి చేరుకుంది. 68 కేసుల్లో కోయంబేడు కాంటాక్టు కేసులు 9 ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ఎనిమిది, చిత్తూరు జిల్లాలో ఒకటి కోయంబేడు కాంటాక్ట్ లు గా అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని 1913 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News