బ్రేకింగ్ : భారత్ లో పెరుగుతున్న కేసులు… ఈరోజు కూడా

భారత్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 64,531 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో కరోనాతో 1,092 [more]

Update: 2020-08-19 04:24 GMT

భారత్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 64,531 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో కరోనాతో 1,092 మంది మరణించారు. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27,67,274కు చేరుకుంది. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంతో మరణించిన వారి సంఖ్య 52,889 గా ఉంది. ప్రస్తుతం భారత్ లో 6,76,514 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,37,871 గా నమోదయింది. ఇప్పటి వరకూ భారత్ లో 3.17 కోట్ల మందికి కరోనా టెస్ట్ లను నిర్వహించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News