ఆ పని చేస్తే కేసీఆర్ కు గుడి కట్టిస్తా

ఏడాదిలో రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి, వ్యవసాయాన్ని లాభదాయకం చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కు గుడి కట్టిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. గురువారం [more]

Update: 2019-04-18 10:41 GMT

ఏడాదిలో రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి, వ్యవసాయాన్ని లాభదాయకం చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కు గుడి కట్టిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ప్రభుత్వం తీసుకున్ని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ 5 – 7 సీట్లు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మైనారిటీలు ఎక్కువగా కాంగ్రెస్ వైపు ఉన్నారని, ప్రజల్లో మార్పు వచ్చిందన్నారు. నల్గొండ, భువనగిరి, మల్కాజ్ గిరి, ఖమ్మం, చేవెళ్ల ఎంపీ సీట్లను కాంగ్రెస్ కచ్చితంగా గెలుచుకుంటుందని, పెద్దపల్లి, జహిరాబాద్ కూడా గెలిచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News