అమ్మా…. ఇక మీరే దిక్కు

పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ నేతలు నూతన గవర్నర్ తమిళసై కి ఫిర్యాదు చేశారు. ఇవ్వాళ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైతో కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, [more]

Update: 2019-09-17 13:34 GMT

పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ నేతలు నూతన గవర్నర్ తమిళసై కి ఫిర్యాదు చేశారు. ఇవ్వాళ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైతో కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, సీతక్క, పొదెం వీరయ్య భేటీ అయ్యారు. పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఫిర్యాదు చేసినట్లు అనంతరం బట్టి తెలిపారు. తలసానితో మంత్రి గా ప్రమాణ స్వీకారం చేయించినప్పటి నుంచి రాష్ట్రంలో ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి పార్టీ మారిన సబితను మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. 12మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం కోర్టు పరిధిలో ఉంది.’’ అని అన్నారు.

 

Tags:    

Similar News