బ్రేకింగ్ : టీడీపీలో భగ్గుమన్న విభేదాలు.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా

కాకినాడ తెలుగుదేశంపార్టీ లో విభేదాలు మరోసారి వెలుగు చూశాయి. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త సత్తిబాబు పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ ఇన్ ఛార్జి [more]

Update: 2021-02-05 05:46 GMT

కాకినాడ తెలుగుదేశంపార్టీ లో విభేదాలు మరోసారి వెలుగు చూశాయి. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త సత్తిబాబు పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ ఇన్ ఛార్జి పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు వారు ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా మాజీ మంత్రి చినరాజప్ప తమను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తమను బాధించాయని వారు చెబుతున్నారు. అయితే పార్టీకి రాజీనామా చేసినా అందులోనే ఉంటామని ప్రకటించడం విశేషం. పిల్లి అనంతలక్ష్మి 2014లో కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Tags:    

Similar News