చంద్రబాబుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏపీ ఎన్నికల అధికారిని చంద్రబాబు బెదిరిస్తున్నారని, బుధవారం ఆయనతో బెదిరింపు ధోరణిలో [more]

Update: 2019-04-11 08:22 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏపీ ఎన్నికల అధికారిని చంద్రబాబు బెదిరిస్తున్నారని, బుధవారం ఆయనతో బెదిరింపు ధోరణిలో మాట్లాడినందున చంద్రబాబుపై చర్యలు తీసకోవాలని ఆయన కోరారు. పోలింగ్ లో హింసను ప్రేరేపించే విధంగా తెలుగుదేశం పార్టీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. కడప జిల్లాలో కొందరు పోలీసులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ నేతలు గొడవలు చేసి ఓటర్లను బయపెట్టాలని చూస్తున్నారని అన్నారు. టీడీపీ నేతలే గొడవలు సృష్టించి వైసీపీపై నెట్టేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతల గొడవలను ఎన్నికల సంఘం అరికట్టాలని కోరారు.

Tags:    

Similar News