30 ఇయర్స్ ఇండ్రస్ట్రీకి జగన్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలలో తనకు అండగా నిలిచిన వారందరికీ నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారు. జగన్ కు టాలీవుడ్ నుంచి కొంత మద్దతు కొరవడింది. ఈ పరిస్థితుల్లో [more]

Update: 2019-07-15 06:17 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలలో తనకు అండగా నిలిచిన వారందరికీ నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారు. జగన్ కు టాలీవుడ్ నుంచి కొంత మద్దతు కొరవడింది. ఈ పరిస్థితుల్లో హాస్యనటుడు పృధ్వీ జగన్ కు అండగా నిలిచారు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. వైఎస్ జగన్ పాదయాత్రలో సయితం సినీనటుడు పృధ్వీ అనేకసార్లు వచ్చి సంఘీభావం తెలిపారు. పృధ్వీ పార్టీలో చేరిన తర్వాత టాలీవుడ్ నుంచి జగన్ పార్టీకి మద్దతు పెరిగింది. ఈ నేపథ్యంలో జగన్ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే పృధ్వీని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్ గా నియమించాలని నిర్ణయించారు. ఈరోజు సాయంత్రంలోగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Tags:    

Similar News