విజయమ్మ వ్యాఖ్యలకు కౌంటర్.!!

Update: 2018-11-11 06:54 GMT

వైఎస్ జగన్మోహన్ రెడ్డి కత్తి దాడి అంతా నాటకమేనని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. వైఎస్ విజయమ్మ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి పోలీసులకు ఈ కేసులో సహకరించడం లేదన్నారు. హైకోర్టు చెప్పినా స్టేట్ మెంట్ ఎందుకు ఇవ్వరని అన్నారు. పాదయాత్రకు జనం రాకపోవడం వల్లనే ఈ డ్రామాలాడుతున్నారని చినరాజప్ప ధ్వజమెత్తారు. జగన్ పై దాడి జరిగిన వెంటనే ఎందుకు విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లారో చెప్పాలన్నారు.

ఏడాది నుంచి చిన్న సంఘటన.....

గత ఏడాదిగా పాదయాత్ర చేస్తున్నా చిన్న సంఘటన జరగకుండా ఏపీ పోలీసులు కంటికి రెప్పలా కాపాడుకున్న విషయం విజయమమ్మకు తెలియదా అని చినరాజప్ప ప్రశ్నించారు. కేవలం సానుభూతి సంపాదించడం కోసమే ఈ నాటకాలాడుతున్నారని ఫైరయ్యారు. ఏపీలో చంద్రబాబు పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని గ్రహించి, జగన్ ఈ కోడికత్తి డ్రామా ఆడారని హోంమంత్రి అభిప్రాయపడ్డారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేకుంటే, ప్రజలపై కూడా నమ్మకం లేనట్లేనని ఆయన అన్నారు.

Similar News