వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి హత్యకు రెక్కీ..?

తన హత్యకు టీడీపీ నేతలు కుట్ర చేస్తున్నారని చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… నెల [more]

Update: 2019-02-05 14:27 GMT

తన హత్యకు టీడీపీ నేతలు కుట్ర చేస్తున్నారని చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… నెల రోజులుగా తన కదలికలను పసిగడుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ నియోజకవర్గ నేత పులివర్తి నాని ఆదేశాల మేరకు ఇద్దరు వ్యక్తులు తన వద్ద డ్రైవర్లుగా చేరారని, తన కదలికలు గుర్తించేందుకు వీరితో పులివర్తి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఇందుకుగానూ ఇద్దరికీ చెరో రూ.15 లక్షల చొప్పున ఒప్పందం జరిగిందన్నారు. కోవర్టులుగా తన వద్ద చేరిన డ్రైవర్లను చెవిరెడ్డి మీడియా ముందుకు తీసుకువచ్చారు. పులివర్తి నాని ఆదేశాలతోనే తాము చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర డ్రైవర్లుగా చేరామని నాగభూషణం, సిసింద్రి అనే ఇద్దరు వ్యక్తులు మీడియాతో చెప్పారు. చెవిరెడ్డి ప్రతీ కదలికను పులివర్తి నానికి చెప్పడమే తమ పని అన్నారు. ఇందుకు గానూ రూ.15 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం జరిగిందని, ఇందులో కొన్ని డబ్బులు ఇప్పటికే ఇచ్చారని స్పష్టం చేశారు. వీరిద్దరినీ చెవిరెడ్డి.. పోలీసులకు అప్పగించారు. రాజకీయంగా ఎదర్కోవాలని కానీ హత్యా రాజకీయాలు చేయాలనుకోవడం సరికాదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.

Tags:    

Similar News