నాతో పెట్టుకుంటే ఫినిష్ అవుతారు..బాబు వార్నింగ్

కాకినాడలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ప్రధాని మోదీ ఏపీపర్యటనకు వస్తే చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు వ్యతిరేకంగా ఆయననే [more]

Update: 2019-01-04 07:39 GMT

కాకినాడలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ప్రధాని మోదీ ఏపీపర్యటనకు వస్తే చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు వ్యతిరేకంగా ఆయననే అడ్డుకుని బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల్లో అవినీతి జరుగుతుందని వారు పెద్దయెత్తున నినాదాలు చేశారు. కాన్వాయ్ ను అడ్డుకోవడంతో చంద్రాబాబు వాహనం నుంచే వారికి తీవ్ర హెచ్చరికలుచేశారు. ‘‘ మీకు సిగ్గుందా? మోదీ అన్యాయం చేస్తుంటే నాకు వ్యతిరేకంగా అడ్డుకుంటారా? నాతో పెట్టుకుంటే ఫినిష్ అవుతారు. అవినీతి ఎక్కడ జరిగింది? ఇలా కార్యక్రమాలను అడ్డుకోవాలని చేస్తూ తీవ్ర చర్యలుంటాయి’’ అని చంద్రబాబు హెచ్చరించారు. పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News